మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .
కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥
హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥
హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥
నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము శుద్ధమౌను మనసులు॥
వ్రతములు పుాజలకును ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు ఇచ్చును శుభ ఫలములు ॥
శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥
ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥
లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥
కార్తీకపురాణము కడు భక్తితొ చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము ॥
నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥
దివ్య కార్తీకముా దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥
అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥
విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥
త్రిపురాసురులగుాల్చ త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో అసురులనిల గుాల్చెను ॥
అందరికానందము హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥
ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥
ఈ ఇష్టపది , నా స్వీయ రచన.
No comments:
Post a Comment