Thursday, October 29, 2020

ఇష్టపది కవితలు మహతీ సాహితీ సంగమం లో రాసినవి

[10/27, 14:51] iswarimurthy: మహతి కవిసంగమం , ప్రతిరోజు కవితా పండగే -
అంశం : పోతన భక్తి తత్వం
నిర్వాహకులు:  శ్రీ.బి. అనంతయ్య
పర్యవేక్షణ డా. శ్రీ అడిగొప్పుల సదయ్య  గారు
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
శీర్షిక : పోతనామాత్యుడు
ప్రక్రియ: ఇష్టపది .


శైవ కుటుంబీకులు సోమనాధు శిష్యులు 
రామ కృపకు పాతృలు  రచనోత్తమొాత్తములు॥

భక్తి మాధుర్యముల భాగవతము రాసిన
బమ్మెర పోతనుడుా బ్రాహ్మణోత్తముడితడు॥

తెలుగు పద్య రచనలు తేనెలొలుకు విధమున
తేలిక గరచియంచు  తెలుగు పండితుడితడు॥

సంస్కృత కావ్యములను   సరళ భాషను రాసి
పామరుల మెప్పించు ప్రజా కవియె పోతన॥

భోగిని దండకమిడె భోగ చాపల్యతగ
సర్వజ్ఞ భుాపాలు సతికై సమర్పణగ॥

శ్రీనాధు సరి జోడు  శ్రీ సమ కాలీనుని
వీరభద్ర విజయము  విశ్వ మేలె కావ్యము॥

నారాయణ శతకము నాధుని గుణ కావ్యము
పద్య పాదములవియె పలు చక్కని పదములు॥

తేనె లొలుకు తెలుగుకు  తేట జిలుగు వెలుగుగ
భక్తి కవిత లేలెను బమ్మెర పోతనుడుా॥

భాగవతపు గాధను భక్తి నిండు చరితను
భగవతోపాఖ్యాన  భాగముల రచించెను॥

రామన్నే శ్రోతగ రాసీ వినిపించెను
భాగవత పురాణము పరమ భక్తి కావ్యము॥

ఎంచ శివ కేశవులు  ఏక తత్త్వ రుాపని
సమానతను చాటిన సమన్వయ దృక్పథుడు॥

రామ భద్రుని ఆజ్ఞ  రసమయమై నిండెగ
అజరామర కీర్తి ని అవని తెలుగు కవిగా॥
[10/28, 11:45] iswarimurthy: రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
"శీర్షిక "థేంక్యుా కరోనా.."

-------.."కధ కాని కధ.-------------

"అమ్మాయ్ స్నానం చేసి వంట చేయమ్మా...
ఆ దేముడికి కాస్తా దీపం పెట్టి ధుాపం వేసి
కొంచం నైవేద్యం పెట్టు.ఇంటికి చాలా మంచిది."
"నానీని  బయటి నుండి రాగానే కాళ్లుా చేతులుా సుభ్రంగా కడుక్కో మనమ్మా।
చీడ- పీడా కదుా..ఏం తొక్కి వచ్చేడో ఏమొా.."
"బట్టలు మార్చుకొచ్చేక అన్నం పెట్టమ్మా..
అవతల దుమ్ము ధుాళి లో ఆడి ఆడి వచ్చేడు.
క్రిములన్నీ వాడి బట్టల పైనే ఉంటాయి 
.అనారోగ్యం కదా.
ఇదుగో అమ్మాయ్..."

ఆబ్భ బ్బ బ్బ బ్బ..
రోజుా ఇదే గోల మీతో...భరించలేక పోతున్నాను.
మడి ,తడి ,పొడి..అంటుా..వెధవ చాదస్తం..వెధవ 
చాదస్తమా అని...అరుపు, విసుగు, నిర్లక్ష్యం 
గోల,  గోల ,గోల....

అటుా ఇటుా అసహనంగా  కదులుతుా గబుక్కున 
లేచేడు నానీ...నిద్ర నుండి. చుట్టుా చుాసేడు...
అవతలి నుంచి "అమ్మ" అరుస్తున్నాది.
"నానీ ।..లేచి సబ్బుతో  సుభ్రంగా చేతులు కడుక్కురా.
ఆ పక్క మీది బట్టలు విప్పి  ఉతికిన బట్ట లేసుకురా..
టిఫిన్ తిందుాగాని.."బయటకు వెళ్ళకు.
ఎవరొచ్చినా  దుారంగా నిల్చొనే మాట్లాడు.
కలగా పులగం అయ్యి కాకెంగిళ్ళు అంటుా తినకు..".
"రేయ్.నానీ....నానీ....నానీ..వింటున్నావా...?"
పొద్దుటి నుంచి అలా అరుస్తునెే ఉంది "శాంతి."

నానీ.ఆలోచిస్తుా మౌనంగా అమ్మ చెప్పినవన్నీ చేస్తున్నాడు.ఎప్పుడుా లేనిది,ఈమధ్య
అమ్మ కుాడా చాలా సుభ్రతలు
పాటిస్తున్నాది. "కరోనా" భయంతో...
రోజుా టి.వి ల్లో సుభ్రతల మీద ఎంతమంది మాట్లాడుతున్నారో...
"కరోనా"..వైరస్ ప్రమాదమైనదట.
సుభ్రత లేకపోతే మనని ఆక్రమిస్తుందట...
చంపేస్తుందట..మహమ్మారట..."

ఇవే మాటలు నానమ్మ చెప్పేది.కానీ అమ్మ వినేది కాదు. సరికదా,రోజుా కసురుకుంటుా...
ఛాదస్తం భరించలేనంటుా విసుక్కుంటుా..
 విరుచుకు పడుతుా...నానమ్మని వ్రుద్ధాశ్రమంలో
వదిలే దాకా నాన్న ని పోరింది.

పాపం..నానమ్మ...చెప్పినట్టు చాలా మంది చెప్పినట్టున్నారు
ఆశ్రమంలో ఎంత మంది నానమ్మలో...ఆలోచిస్తుా...
నానీ అమ్మ చెప్పినవన్నీ చేసేడు.
రెడీ అయ్యి , బయటకు వచ్చేడు.
అమ్మ నాన్నకు టిఫిన్ పెడుతున్నాది.
నాన్న దగ్గరగా వెళ్లేడు..నాన్న...బయటకు వెళ్ళాలి..అన్నాడు.
ఎక్కడికిరా..? అన్నాడు నాన్న..
"అమ్మను ఆశ్రమంలో వదిలి వద్దాం.
అమ్మ కుాడా నానమ్మ లాగే రోజుా అరుస్తున్నాది.
సుభ్రత, మడి, దుారం...అంటుా..
నాకు విసుగొస్తున్నాది...అమ్మ ఇక్కడొద్దు..."

నానీ మాటలు విన్న శాంతి  కళ్ళ ల్లో గిర్రున తిరిగిన కన్నీళ్లు  చటుక్కున లోపలికెళ్ళిపోయింది.
తలవంచుకున్నాడు నాన్న.

ఐదు నిముషాల్లో తయారై వచ్చిన శాంతి "పదండి ---
అత్తయ్యను ఇంటికి తీసుకువద్దాం "అంది.
నాన్న కళ్ళల్లో ఆశ్చర్యం ..అమ్మ ముఖంలో పశ్ఛాత్తాపం..నానీ కళ్ళల్లో ఆనందం..
ముగ్గురి మనసుల్లోనుా
ఒకటే మాట..థేంక్ యుా---
       "  కరోనా."
       ----------------
[10/29, 14:13] iswarimurthy: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శీర్షిక : వందే వాణీ.

బ్రహ్మ మానస పుత్రి బ్రాహ్మీ హంసాసని
సామగానాది ప్రియ సంగీత వినోదిని॥

కరధృత వీణా ధరి ఘన పుస్తక పాణీ
వాగ్విలాసి వరదే  వనజ భవు ప్రియ రాణి॥

మణి మయాది భుాషణి మదనాంతకు సోదరి
సత్య లోకవాసిని  సామ గాన లోలిని ॥

అక్షయ తేజోమయి  అక్షరస్వరుాపిణి
ఈప్సిత వర దాయకి ఈశ్వరీ హృత్సదని॥ా

Friday, October 23, 2020

భగవద్గీత లింక్

మీరు ఏ ఊర్లో ఉన్నా, మీ ఇంట్లోనే ఉంటూ, మీకు నచ్చిన సమయములో, మీ మొబైల్ ఫోన్ ద్వారా భగవద్గీతను ఉచితముగా నేర్చుకునేందుకు వీలుగా భగవద్గీత 18 అధ్యాయములు, 700 శ్లోకములను అర్ధాలతో సహా రికార్డ్ చేసి వెబ్ సైట్ లో పెట్టాము. మీరు చేయవలసిందల్లా http://learnbhagavadgitaonline.org అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి, మీ భగవద్గీత పుస్తకమును తెరచి, 1వ అధ్యాయము 1వ శ్లోకము నుండి మొదలు పెట్టి, రోజుకి పది శ్లోకములను అర్థాలతో సహా నేర్చుకోండి. 70 రోజులలో మీరు భగవద్గీత 700 శ్లోకములను చదవగలుగుతారు. భగవద్గీతను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎంతోమంది భగవద్గీతను నేర్చుకోవాలి అనుకున్నా నేర్పించేవారులేక నేర్చుకో లేకపోతున్నారు. దయచేసి ఈ మెసేజ్ ను వాళ్ళందరికీ అందేటట్టు వీలైనంత మందికి ఫార్వర్డ్ చేయండి.

💐🚩🕉️🚩💐

Tuesday, October 20, 2020

దాంపత్య జీవితం.

రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
--------------------------
ప్రక్రియ.
సమ్మొాహనాలు.
శీర్షిక .
దాంపత్య జీవితం.
------------------------
అందమైనది ఇల్లు
ఇల్లంత సందళ్ళు
సందళ్ళ పెరిగారు పిల్లలుా  ఈశ్వరీ॥

పెరిగి  పెద్దయ్యేరు
పెద్దయిన పిల్లలుా
పిల్లలకు పెళ్ళిళ్ళ సందళ్ళు ఈశ్వరీ ॥

కోడళ్ళు అల్లుళ్ళు 
అల్లుళ్ళ సందళ్ళు
సందళ్ళ బాధ్యతల బరువులుా ఈశ్వరీ ॥

గడ్డు కాలము వచ్చె
వచ్చి వయసే తెచ్చె
తెచ్చె ముదుసలి తనము నేయిచ్చె ఈశ్వరీ॥

పనిచేయ లేకున్న
లేకున్న చేసినా
చేసినా ఆరళ్ళు తప్పనైన  వీశ్వరీ ॥

విసుగు , ఛీత్కారాల
ఛీత్కార  బతుకుల
బతుకేల యనుచునుా విల-విలలు ఈశ్వరీ  ॥

వృధ్ధాశ్రమాలగతి
గతి తమకు పోగ మతి
మతిపోయి పయనము మారాతి దీశ్వరీ ॥

లేదు చావుకు భయము
భయము సహచరి, గనుము
గనిన మే మొంటరిగ మనలేము ఈశ్వరీ ॥

ఒకరికొకరము తోడు
తోడుగా మని జోడు
జోడుగనె పోవరుగ ఏనాడు ఈశ్వరీ..॥

ఈనాటి పిల్లలే
పిల్లలు పెద్దలు లే
రేపటికి ఔదురుగ ముదుసలులె ఈశ్వరీ ॥

పిల్లలకై  జీవము
జీవితము అంకితము
అంకితము  అనర్ధమని తెలియము  ఈశ్వరీ॥

ఋణము తీర్చెడి గుణము
గుణ హీనకు స్వార్ధము 
స్వార్ధమేలె ఇలలో ఇది నిజము ఈశ్వరీ ॥

ఈతీరు మారనిది
మారని  సమాజమిది
సమాజము మనము గద, నీతేది ఈశ్వరీ ॥

తామరను అంటదు 
అంటదు నీరంటదు
అంటదు విషయములను అంటదుా  ఈశ్వరీ॥

నమ్ము సతిని వీడకు
విడచి  అతిగా చెడకు
చెడి సతి కంటనీరు రానీకు ఈశ్వరీ. ॥

అమ్మ రుాపు తానై
తానై చెలి తానై
తానే నీ వలపై  నీ తోడు ఈశ్వరీ ॥ 

కష్ట-సుఖములతోడు.
తోడునీ సరి జోడు
జోడు  చివరి వరకు వదలకెపుడు ఈశ్వరీ ॥

  










Sunday, October 18, 2020

ఆడపిల్ల.

రచన, శ్రీమతి, 
 పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. ( మహరాష్ట్ర ).
 8097622021
 ------------------------------
శీర్షిక .
ఆట బొమ్మ.
---------------
కాలుష్య మెరుగని, కల్లక పటము లేని
చిన్ని పాపను నేను , చింత లేవెరుగను॥
చిందులేయుచు ,అమ్మ ఒడి చేరి నిదురించు
చిన్న పిల్లను చిన్ని  పసి పాపను నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

అన్న ,నాన్నా, తాత,మామ, నాదీ యనుచు
వలపు పంచెడి పసిడి పాల పలుకు ను నేను॥
అంత రంగమునల్ల కల్లోల మైనట్టి
అలోచనలు రాని చిన్ని ప్రాణి ని నేను॥
ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥

ఆడ -మగలను వేరు, భావమ్ము తెలియని- 
పసి మనసు కలగిన పసిడి పట్టిని నేను. ,
ఏ చేయి రక్షించు ,నే చేయి బక్షించు నను
మర్మ మెరుగని , మమత  కొమ్మను నేను॥

 ముద్దు మురిపెపు వలపు..సద్దు మణగిన పిలుపు_
 సరి కీడు లెరుగని , వట్టి వెర్రిని నేను.
 పసి దేహమును కామ, చింతనతో చుాచేటి
 కాముకుల చిత్తమును ఎరుగనైతిని నేను
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
 ఆదరించిన  చేయి ,అన్న మెట్టిన చేయి, 
 అమ్మ ఒడి సాటనీ...నమ్మి మురిసితి నేను.
 నటన నేర్చిన నరుల, వికట రీతుల వలల
 చిక్కి చితికిన చిన్ని, ముద్దు గుమ్మను నేను.
 ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
 
  నాది , నా వారనుచు నమ్మ,  నను గద్దించి
  నిలిపి నలిపిన , భీతి నేడ్చు బేలను నేను
  విధి వంచనకు  లొంగి , తోలు బొమ్మగ మారి,
  నయ వంచకుల , వేటకాట బొమ్మను నేను
  ఆడ పిల్లను నేను. వట్టి అబలను నేను.॥
  
  వికసించనటువంటి  వట్టిపుాలను పట్టి
  నలిపేటి దుష్టులను దునిమేది ఎవరు..?
  ఆడతనమున అమ్మ ,అక్క ,చెల్లెల , కనని
  క్రుారులను నరికేటి  కత్తి పట్టే దెవడు..?
  కన్నీటి కార్చిచ్చు..రగిలి మంటగ మారి
  కాముకుల దహియించు దినము వచ్చేదెపుడు ?

  -----------------------------------------------------
 

Friday, October 16, 2020

భుామి గుండ్రంగా ఉంది

శీర్షిక .
భుామి గుండ్రంగా ఉంది.
---------------------------------------

తెల తెల వారుతుాండగా వినిపించే
పక్షుల కువకువలు మనసు వీణను
మీటుతుా భుాపాల రాగం పాడుతుా 
మేల్కలొపే మధురానుభుాతి....ఏదీ...?

ఆరు బయట నీరెండ తో చెలిమి చేస్తుా,
కళ్ళాపి చల్లిన ,పచ్చని వాకిలి పై
 ఇంద్రధనుసు తో పోటీపడుతుా 
 అలరించే అందాల రంగవల్లులు  ఏవీ...?
 
నీలి మేఘాలతో దోబుాచులాడే అందమైన
పడుచు సోయగాలు , గాలి గంధాల తో సాగే
ఆడతనపు  సిగ్గు సింగారాలు,  పట్టు పావడాల..
రెప- రెప లుా , కాలి మువ్వల గల గల లుా..ఏవీ. , 

సిగ్గు సింగారాల నడుమ..
కొంటె చుాపుల వాడి పరిమళాలు , 
వన్నె చిన్నెల ,వలపు పిలుపుల,
వావి వరుసల , అందాల బంధాలు...ఎక్కడ..?

చుాస్తుాండగానే అందమైన 
ఆవరణలు కరువయ్యేయి..
పచ్చదనం కనుమరుగై 
గాలికి గంటుపడింది

పుట్టగొడుగుల్లాంటి కట్టడాలతో
కాలుష్యం నిండిన కంపు సందుల్లో
మానవీయత, మాన మర్యాదలుా
మత కల్లోల ,మారణహోమాల్లో  
మట్టుకొట్టుకుపోయేయి॥

మనిషి తనం , పరువు ధనం
 కళేబరాల ముసుగుల్లో
వాత, పిత్త , కఫాల బారిన  పడి
," కరోనా " పేరుతో కలబడి
 పొడిదగ్గు  సొగసుల్తో 
 పాపాడికెక్కుతున్నాయి.
 
మంద లాంటి జనం మతి  కోల్పోయిన 
కోతుల్లా , పళ్ళేల చప్పుళ్ల మధ్య
చప్పట్ల ,సవ్వడులు చేస్తుా..
చిరుదీపాలతో కరోనాను
తరిమే ప్రయత్నం చేస్తున్నారు.॥

కణం చేసే కర్కశ చర్యలకు
దిక్కు తోచని జనం  , దీర్ఘకాల
గృహ నిర్బంధాలకు బానిసలై
బేడీలు లేని దొంగల్లా
తమ తమ ఇళ్ళ లో 
తమకి  తామే బందీలౌతున్నారు.॥

పాశ్ఛాత్య పద్ధతులకు 
పట్టం కట్టిన జనం
పరదేశపు కణాన్ని చుాసి
పరుగులంకించుకుంటున్నారు.॥

ఇంతలోనే వింత మార్పు.
విచ్చలవిడితనం ఇంటిదారి పట్టింది.
స్వశ్ఛత నిండిన చేతలకు శ్రీకారం చుట్టింది
సంప్రదాయాలకు సాదరాహ్వానం పలికింది ॥

ఆ దెబ్బతో
పాత పద్ధతులను 
చీదరించుకున్న జనం
అవే ఆచారాలను పట్టి పట్టి  
పాకులాడుతున్నారు ॥

ముాతికి గుడ్డలు
ముఖానికి ముసుగులు వేసుకొని
ఆచారాలు , మడి ,తడులను
సానుకుాలంగా సద్దుబాటు 
చేసుకుంటున్నారు.హత విధీ
భుామి గుండ్రంగా ఉందంటే
ఇదే నేమొా...॥
------------------
రచన,  శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .
------------------------------