Friday, November 13, 2020

యతి మైత్రి అక్షరాలు.

జగదీశ్వరీమూర్తి గారు పద్యాలు బాగున్నాయండి. అయితే యతిమైత్రి విషయంలో ఖచ్చితత్వం కొరవడినట్లుంది. ఈ - ఓ యతి చెల్లదండీ. చివరి పద్యంలో బాగానే ఉంది. 
ఇఈఋౠఎఏ యియీయృయౄ యెయేహిహీహృహౄ హెహే -- ఇవి యతిమైత్రి అక్షరాలు 
ఉఊఒఓ యుయూయొయోహుహూ హొహో -- ఇవి యతిమైత్రి అక్షరాలు 
అఆఐఔ యయాయైయౌ హహా హైహౌ-- ఇవి యతిమైత్రి అక్షరాలు 
సదయ్య గారు కవి సంగమం గ్రూపులో పెట్టి యున్నారు చూడగలరు 
అన్యధా భావించక యతి సవరణ చేయగలరని విన్నపం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                                    శ్రీహరికోటి

నరకాసురు వధ : దీపావళి కధ.

పెన్నా రచయితల సంఘం వారి  దీపావళి
మరియు  బాలల దినోత్సవ సందర్భంగా రాసిన కవిత.

రచన, శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంశం..బాలల దీపావళి.
శీర్షిక .
నరకాసురుని వధ.
----------------------

బాలలుా  తెలియుమా దీపావళి మహిమ
బహు చక్కనైనది భక్తి నిండెడిది॥

విష్ణు అవతరించెను వరహావతారుడై
భుాలక్ష్మి నేలిన  భగవంతుడీతను॥

వారి పుత్రుడు  ఇతడు పేరు నరకాసురుడు
అసుర గుణములతోడ జనియించినాడితడు.॥

తెలిసి వగచీ తల్లి  భూాదేవి చింతింప
ఆమె చేతిని  అతని మృత్యువని ఎరిగించె॥

గురు "జనకు" శిష్యుడై  గుణ సంపదల నెరుగు
కడు భక్తి నిండిన కామాఖ్య భక్తుడు.॥

దేవీ ఉపాసనల  దేహ బలమును పొంది
దేవతల హింసించి  దేవలోకములేలె ॥

దేవతలు మొరలిడగ భామా సమేతుడై
శ్రీకృష్ణుడభయమిడి   సమరసంసిద్ధుడయె॥

తల్లి భుామియె సత్య  భామావతారిణి
లోక కంటకు దునిమి లోకాలు కాపాడె॥

నరకాసురుని వధకు నరులు పండగ జేసి
దీపాల నలరించి దేవతల పుాజించె ॥

బాణసంచారాల బాలలా సందడుల
ఆనంద దీపావళై   అలరె భువిలోన ॥



Wednesday, November 4, 2020

మానవత్వం

15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------

శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట  లేటుగా ,  ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
 చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై 
అడిగింది  పది రుాకలు చంటిదాని  మందుకై॥
నాగాల లక్కల్లో  నయాపైస రాదంటుా  
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి  సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ  అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥ 
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు  అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ  
కరగె నాలో కఠినత్త్వము కంటి  నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥. 
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో  
మేలుకుంది  మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని  సంచిలోన  వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక  ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------


హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
 .అనే  ఈ కవిత,
 ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

చిత్ర కవిత.

గోరసం చిత్ర కవిత కొరకు మాత్రమే రాసినది
శీర్షిక .
చిత్రం...భళారే విచిత్రం.
(వచన కవిత).
--------------------------------
చిత్రాల జగతిలో మనిషొి మహా మేధావి.

జరుగు తున్న చిత్రాలకు ఆసక్తి కరమైన

విషయాలను జోడించి వివిధ చిత్ర పరికరాలలో

చిత్రవిచిత్రాలను వివిధ మాధ్యమాల ద్వార

ప్రచారం చేసేడు. దాంతో మనిషిలో విద్యలతో

మేల్కొన్న మేధావి వివేకాన్ని మరిచేడు .

విలువలని విరిచేడు.బంధాలు బరువయ్యేయి

బాంధవ్యాలు కరువయ్యేయి పుార్తి లోకం చిత్ర

పరికరాలకు బానిసైపోయింది.ఈ నాడు

దుార వాణి , చరవాణిల వింత లోకంలో చరిస్తున్న

మానవుడు మానవత్వాన్ని మరచిన మరోమృగం.

కాలుష్యాన్ని పెంచుతుా కామాంధుడై చరిస్తుా

వికృత చర్యల వికటాట్టహాసాలతో కన్నీళ్ళను

పంచుతుా తనను తానుగా దిగజారిపోతున్న

దిశ నిర్దేశం లేని దశ హీనుడు.చుట్టుా ఎంతమంది

ఉన్నా ఎవరుాలేని-ఎవరికీ కాని ఏహ్యభావాల ఏకైక
                                    ఏకాకి.
---------------------------------------

రచన:శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.