గోరసం చిత్ర కవిత కొరకు మాత్రమే రాసినది
శీర్షిక .
చిత్రం...భళారే విచిత్రం.
(వచన కవిత).
--------------------------------
చిత్రాల జగతిలో మనిషొి మహా మేధావి.
జరుగు తున్న చిత్రాలకు ఆసక్తి కరమైన
విషయాలను జోడించి వివిధ చిత్ర పరికరాలలో
చిత్రవిచిత్రాలను వివిధ మాధ్యమాల ద్వార
ప్రచారం చేసేడు. దాంతో మనిషిలో విద్యలతో
మేల్కొన్న మేధావి వివేకాన్ని మరిచేడు .
విలువలని విరిచేడు.బంధాలు బరువయ్యేయి
బాంధవ్యాలు కరువయ్యేయి పుార్తి లోకం చిత్ర
పరికరాలకు బానిసైపోయింది.ఈ నాడు
దుార వాణి , చరవాణిల వింత లోకంలో చరిస్తున్న
మానవుడు మానవత్వాన్ని మరచిన మరోమృగం.
కాలుష్యాన్ని పెంచుతుా కామాంధుడై చరిస్తుా
వికృత చర్యల వికటాట్టహాసాలతో కన్నీళ్ళను
పంచుతుా తనను తానుగా దిగజారిపోతున్న
దిశ నిర్దేశం లేని దశ హీనుడు.చుట్టుా ఎంతమంది
ఉన్నా ఎవరుాలేని-ఎవరికీ కాని ఏహ్యభావాల ఏకైక
ఏకాకి.
---------------------------------------
రచన:శ్రీమతి:
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
No comments:
Post a Comment