31/05/2022
శ్రీశ్రీ కళా వేదికలో
అంశం : వృద్ధాశ్రమాలు
శీర్షిక : కన్నీటి కథలకు సాక్ష్యాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఎక్కడ నుండో వస్తున్న కన్నీటి వెక్కిళ్ళు
ఏ తల్లో కోల్పోయిన జ్ఞాపకాల సుళ్ళు
బిడ్డ పుట్టిన సంబరాన విరిన నవ్వుల పుాలు
నేడు వాడి నలిగిన రాతకు రగిలిన సెగలు ॥
నడక నేర్చిన బిడ్డ అడిగి కోరిన ఆట బండి
అప్పు చేసి కొన్న పాపానికి లేని తిండి
తాము తిన్నా తినకున్నా తెలియనీయని
అమ్మ తనం , ఆకలి కష్టానికి ఆదుకోని శరీరం ॥
కాయ కష్టానికి దొరకని దుడ్డు లేపిన దుమారం .
మగని పిరికి తనానికి నిండు బావి నీరే సాక్ష్యం .
కొరతబడిన ప్రాణానికి ప్రాణమైన పసి ప్రాణం.
సాకిన ప్రేమకు బిడ్డను చదివించడమే లక్ష్యం ॥
తొమ్మది మాసాలు బరువును మొాసిన శాపం
ఎదిగిన రక్తబంధంలో ఏపుగా పెరిగిన స్వార్ధం .
మదిర- మగువల చాటున మరచిన మానవత్వం .
పెంచిన మమతపై చుాపిన కృుార ప్రతాపం ॥
నేడు వృద్ధాశ్రమాల వెలిసిన గోడల బీటల్లో
దాగిన ఎన్నో అపశృతుల గతిలేని గీతాలు
ఎండిన శరీరాలకు నీడనిచ్చే ఓదార్పు గళ్ళు.
పెంచిన మమకారాలకు పేగు బంధాలు వేసిన సంకెళ్ళు॥
నేడు వృద్ధాశ్రమాలు
"నా" అన్నవారు రాని భాధితుల బందీలు.
నిరీక్షణ నిండిన కళ్ళకు నిదుర రాని శోకాలు .
గది గదిలో నిండిన కధలకు ,కన్నీటి కాల్వల ఊటలు .
చితుకు బ్రతుకు పొిరాటాలకు ఆలంబనైన
కొడిగట్టిన దీపాలు ॥
వృద్ధాశ్రమాలు .....
కన్నీటి కష్టాలకు స్పందించలేని నీరుారని
కన్నీటి వెక్కళ్ళకు మారు పేర్లు ॥