Monday, November 22, 2021

కార్తీక పౌర్ణమి

మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥

హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥

హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥

నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము  శుద్ధమౌను మనసులు॥

వ్రతములు పుాజలకును  ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు  ఇచ్చును శుభ ఫలములు ॥

శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥

ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు 
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥

లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥

కార్తీకపురాణము కడు భక్తితొ  చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము  ॥

నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥ 

దివ్య కార్తీకముా  దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥

అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥

విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥

త్రిపురాసురులగుాల్చ  త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో     అసురులనిల గుాల్చెను ॥

అందరికానందము  హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥

ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥

ఈ ఇష్టపది , నా స్వీయ రచన.











కణ్వ మహర్షి .

అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


ఘోరుడను ఋషిపుత్రుడ ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి  గణ్యుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా  ప్రాశస్త్యము నొందెను॥

వేద మంత్ర ద్రష్ట- రు  గ్వేదమంత్ర  పుాజ్యుగా
చతుర్వేదమందున   చర్చ కణ్వ వివరణ .
విశ్వామిత్రు జేరె    విధి పుత్రి శకుంతల
కణ్వాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥

గాడమైన యొాగము గాంధర్వ  వివాహము  
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసుని శాపము 
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥ 
  
 శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
 దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
 ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
 బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥ 
 
యాత్ర జేయ కణ్వుడు  యాదవ పురమేగెను 
సరసమాడ యాదవులు  శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ  నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను   ముప్పుగనదె మారెను ॥

యాదవులు నశించెను  యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము  శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా  గనినట్టే చదివిన,
జగదీశ్వరి మురిసెను  జగమునకెరిగించెను ॥.



 
   
   

దత్తపది

అంశం: *దత్తపది*

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

ప్రక్రియ: తేటగీతి
 క్రమ సంఖ్య: 19
 కవితా సంఖ్య : 4.

(దీప) దానము జేయుము  దివ్య  ముగను
(ధుాప )మిడిభవు నికొలువ  దుఃఖ శమము
(తాప )సహరుని  పుాజింప  తరుణ మిదియె
(పాప) ములబాపు కార్తీక  పర్వ మిదియె॥

ప్రక్రియ : ఆటవెలది.

ఇంటి (దీప) మాలి  ఇడుముగౌ రవప్రేమ.
(ధుాప) మింట వేయ దురిత శమము
(తాప) మెక్కి నరుడు తప్పుజేసి నయెడల
(పాప) మిలను పెరిగి పగులు ధరణి ॥

చిన్న (దీప) మున్న చీకట్లు తొలగును
(ధుాప)  మేయ క్రిములు దుార మౌను 
కోప (తాప )ములతొ కోల్పోవు సుఖములు
(పాప) భీతి ధర్మ పథము జుాపు ॥






Saturday, November 13, 2021

అన్నీ ఉన్న అనాధ

అంశం : స్నేహమేరా జీవితం.
శీర్షిక ; అన్నీ ఉన్న అనాధ.


స్నేహామన్నది చాలా అపుార్వమైన బంధం .
నమ్మకానికి ,విశ్వాసానికి , నిలువెత్తు నిదర్శనం .
అంతరాలు చుాడని కృష్ణ-కుచేలులంటి అనుబంధం.
సుఖ సంతోషాలను కలిసి పంచుకునే 
 అనురాగ  స్నేహం ॥
 
 ఒంటరితనపు అసహనానికి స్నేహం ఒక ఓదార్పు.
 ఒడుదుడుకుల ఒత్తిడిలో  మానసిక ధైర్యం స్నేహం .
కష్టాల బాటలో చిరునవ్వుల ఆత్మవిశ్వాసం  స్నేహం॥

బాధల్లో కార్చే కన్నీటిని  ప్రేమగా 
తుడిచే ఆపన్న హస్తం స్నేహం.॥
కులమత బేధాలకు అతీతమై  నీ -నా
తేడాలు చుాపని హృదయ స్వాంతన స్నేహం.॥

 స్నేహమే జీవితమన్న మధురానుభుాతికి
 శాశ్వతమైన ఆలంబన స్నేహమే ॥
"ఎవరికెవ"రన్న  భాధాపుారిత హృదయానికి
"నేను"న్నానన్న  అపారమైన నమ్మకం స్నేహం ॥
.
చనిపోయిన  స్నేహితుని మరువలేక ఆత్మహత్య
చేసుకున్న మరొక స్నేహితుని కారణంగా, చలించిన
అమెరికా ప్రభుత్వం,ఆగష్టు మొదటి ఆదివారాన్ని
ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డేగా  ప్రకటించింది.॥

 అటువంటి అనిర్వచనీయమైన స్నేహ బంధాన్ని
స్వార్ధపుారిత ఆలోచనలతో అపనమ్మకంతో , అనుమానాలతో దుారం చేసుకుంటున్న మనిషి 
జీవితంలో అన్నీ ఉన్నా ఎవరుా లేని అనాధే ॥ 

అటువంటి పవిత్ర బంధానికి నానాటికీ 
తగ్గుతున్న విలువకు నేటి రోజులు సాక్ష్యం .
మారుతున్న మనస్తత్వాల్లో తరుగుతున్న మమతలు
మనిషి మీద మనిషికి నమ్మకం లేని మనసులు-,
ఏ కష్టానికి  కుాడా చలించని మనస్తత్వాలు.॥
         ॥ఈ నాడు స్నేహం ఒక నాటకం॥ .


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

Monday, November 8, 2021

బాల భారతం.

*బాలభారతం ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక : బాల భారతం.
పద్య ప్రక్రియ : ఆటవెలది.

కల్ల కపట మెల్ల  కానరాని వయసు
మర్మ మెరుగ నట్టి మనసు దినుసు
వావి-వరుస లెంచి వరుసపి లుపుతోడ
పరుల నమ్ము లేత పసిడి వయసు॥

ఆట పాట లాడి అల్లర్ల  మునిగేరు
ముద్దు జేయ ఒడిని మురిసి జేరు
మామ తాత యనుచు మనసార నదెనమ్మ
తనదు ప్రాయ మెల్ల తారు మారు॥

కాము కులకు జిక్కి  కమిలి కుమిలె బాల
రక్ష ణిలను గనక రగిలె బేల 
పశువు కన్న హీన పరుడైన మగవాడు
గనడు వావి వరుస గార్ధభుండు ॥

నమ్ము పిల్ల దాని నట్టేట ముంచేటి
నరులు రాక్షసు లిల నమ్మ బోకు
కామ మెంతో పెరిగె  కాముకులిల నిండె
ఆడ జన్మ మదియె  అరటి ఆకు॥

.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.

హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన

చిత్రకవిత

మహతీ సాహితీ కవి సంగమంలో.
తేది: *08-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
(వచన కవిత ).
మ.సా.క.సం. 19
కవిత సంఖ్య .1.
శీర్షిక  : మనో యుద్ధం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నోటితో మాట్లాడుతూ
నొసటితో వెక్కిరించే మనిషి నైజం.
అందితే కాళ్ళు అందకపోతే పిలక వైనం
మానవ మస్తిష్కం , స్వార్ధపుారిత
ఆలోచనల మరో ప్రపంచం.॥

మనిషిలో మరో మనిషి చేసే హెచ్చరిక
మనిషి బుద్ధికి అందక తనకు  తానే
చేసే అహంకారపు  అణచివేత. ॥
తన "లో "తనను  అణచివేసే ప్రయత్నంలో
తనను తాను కోల్పోతున్నా
తెలీని అజ్ఞానపు  చీకటి కోట ॥

మనిషకి , మానవత్వానికి
జరిగే యుద్ధంలో మత్సరం నిండిన
ఆలోచన చేసే పతనానికి
బలౌతున్న మనిషి బుద్ధి-॥

బురదగుంటలో బుద్ధి  వేసే
అడుగుతో, మనిషికి మనసుకి
మధ్య జరిగే అంతర్యుద్ధం॥

కళ్ళెదురుగా "మన"ను మనకు
పరిచయం చేస్తున్న మనసు పుటలను,
మనను మనమే  చదువుకోలేని అజ్ఞానం .॥

రెండు నాల్కల పాములా, రెండు
ఆలోచనల మెదడుతో
ఎవరికీ ఎవరుాకాని అశాంతి జీవితానికి
బలౌతున్న మానవ మేధావి
తను తవ్వుకున్న గోతిలో
తానే పడుతున్న స్థితి.
మారని మనుషుల
మాయాజాలపు మనోగతి ॥

Thursday, November 4, 2021

భీమసేనుడు

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రక్రియ : ఇష్టపది.

శీర్షిక : వజ్రకాయుడు.
(వచన కవిత )


కుార్మి యాదవ రాజు కుంతిభోజరాజుకు
పలుక గారములేలు పట్టి భోజ పుత్రిక ॥
కోరుకున్న దేముడే కోరు సంత తిచ్చునని ,
వాసిగ దుార్వాసుడు  వరమొసగెను ఆమెకు ॥

పసి ప్రాయపు ధ్యానము వరమడిగిన మంత్రము
పఠియించిన  ఫలముా  పసి బిడ్డకు జన్మము
నీట విడెచె బాలుని నిజ భయమున  కుంతీ.
రహస్యమును దాచెను రాత్రి పవలు వగచెను ॥

సరి సమయము వచ్చెను  సఖి కుంతి వివాహము
కురువంశపు రాజుతొ  గుాడిన శుభ సమయము
యొాగ సంతానమదె యొాగ్యతగలదనుచును
యోగ దృష్టిధనులైన  యొాగులు సరి పల్కెను॥

కురువంశ సంజాతుడు  కుంతీ వర పుత్రుడు
భీషణ ఘన కాయుడు భీముడు జనియించెను 
పాండు రాజు భార్యగ పాండవులకు తల్లిగ
కుంతి  పేరుగాంచెను  కులసతిగా  నిలిచెను.॥

పాండవానుజుడితడు బలవంతుడు భీముడు. 
వాయు పుత్రుడీతడు వరలతిబల కాయుడు
సరి నాగుల వరముతొ సహస్ర కరి బలుడు
మాత్ర గదా ధరుడుా మల్ల యుద్ధ యొాధుడు ॥

జంపె బకాసురునుా జరాసంధు చీల్చెను
హిడింబసురు దునిమెను "హిడింబి "పెండ్లాడెను.
ఘటోత్కచ,శ్రుతసోము ఘన పుత్రులు భీమకు
 హిడింబీ, ద్రౌపతుల హిత పుత్రులు ఇరువురు  ॥

అమ్మ మాట మరువడు అన్నయాజ్ఞ  మీరడు 
అతడె భీమసేనుడు  అతి వజ్రకాయుడుా 
కురుక్షేత్ర సమరము  కుల హీనుల దమనము
అనుజులు కౌరవులను అంత మిడిన ఘనుడుా॥

ఆరు అక్షౌహిణుల  అదె కౌరవ సైన్యము
నిర్జించిన వీరుడు నిజ భుజ బల భీముడు
భారతమున బలుడుా, భరత కీర్తి చరితుడు
ఈశ్వరికిల యిష్టుడు  ఇటువంటి సొిదరుడు ॥


శ్రీశైల క్షేత్రం.

తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్-వారి...

అంశం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి వైభవం
కవితా సంకలనం కొరకు,

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

శీర్షిక :  జ్యోతిర్లింగ స్వరుాపుడు.

శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు 
కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. ॥

ఈ క్షేత్రంలో భ్రమరాంబా సహితుడైన శ్రీ 
మల్లిఖార్జునస్వామి భక్తులకోర్కెలుదీర్చే 
స్వామిగా అభయహస్తుడై లింగరుాపంతో
రాజిల్లుతుా  ఉంటాడు.॥

 ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో ఆరవది  ఐన శ్రీశైల క్షేత్రం  నాలుగు  గోపురాలతో
 అత్యద్భుతమైన కట్టడాలుగా  నిర్మించిన దేవాలయాలతో నిత్యముా హర నామస్మరణతో
 పవిత్రమై ,కన్నుల-కింపైనదిగా ప్రసిద్ధి కెక్కింది.

ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం , 
గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుణ్ణి
దేవతలు , దేవగురువైన బృహస్పతిల
సహకారంతో ఆ పరమేశ్వరి  తుమ్మెద రుాపంలో
వచ్చి వధించిందని ప్రతీతి.

స్వశ్ఛమైన నీరుగల  మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక 
ఎన్నో  ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.

*****


 
 ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం , 
 గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుడు 
 తన తపోశక్తితో తనకు మరణం లేకుండా బ్రహ్మచే వరం పొందడంతో ,భయ భీతులైన దేవతలు 
 ఆదిశక్తిని  ప్రార్ధించగా..గాయత్రీ ఉపాసకుడైన  
 ఆతనిని చంపడం ఎవరి తరముా కాదని అంబ
 పలుకుతుంది.
 అటుపై దేవతలు తమ గురువైన 
 బృహస్పతిని గుాడి వేసిన పథకం ప్రకారం,
 తమ గురువును అరుణాచలునివద్దకు పంపుతారు.
 దేవగురువైన బృహస్పతి ని జుాచి అరుణాచలుడు
 ఆశ్ఛర్యచకితుడై, అతని రాకకు కారణమడుగగా
 బృహస్పతి , తామిరువురుా గాయత్రీ ఉపాసకులు కావడమే ఒక పెద్ద కారణమని చెపుతాడు.
 అదివిన్న అరుణాచలుడు , "దేవతలు కొలిచే గాయత్రిని తాను కొలువడమా." అని అహంకరించి
 గాయత్రీ ఉపాసనను  విడిచిపెడతాడు.
అది చుాసి  కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.

ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥

ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥

స్వశ్ఛమైన నీరుగల  మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక 
ఎన్నో  ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.

శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.


 
 2.
   నల్లమల ఆడవుల లో కొండగుట్టల మధ్య గల
శ్రీశైల క్షేత్రం లో,  ద్వాదశలింగాల లో ఒకటైన
శ్రీ మల్లికార్జునుని పవిత్ర లింగం ఉండడం వలన 
ప్రసిద్ధ శైవక్షేత్రం గా పేరుపొందింది ॥

ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥

ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥

క్రీ.శ.6వ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం
 పేరు కనిపిస్తుా , చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిదిగా ప్రసిద్ధి చెందినద  క్షేత్రం 
 శ్రీశైలం.॥

Tuesday, November 2, 2021

మొలుస్తున్న పుర్రెలు

1/11/2021.
అంశం : చిత్రకవిత.
(మొలుస్తున్న పుర్రెలు)


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

పద్య ప్రక్రియ : ఆటవెలది.

మనిషి  స్వార్ధ పరుడు  మహిపాడు ధనమేల
మనిషి  మృగమ దాయె  మదము నిండె
ఆస్థి కొరకు వేట అన్నదమ్ముల కోత
తారు మారు జగతి తలలు మొలిచె ॥