Monday, November 8, 2021

చిత్రకవిత

మహతీ సాహితీ కవి సంగమంలో.
తేది: *08-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
(వచన కవిత ).
మ.సా.క.సం. 19
కవిత సంఖ్య .1.
శీర్షిక  : మనో యుద్ధం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నోటితో మాట్లాడుతూ
నొసటితో వెక్కిరించే మనిషి నైజం.
అందితే కాళ్ళు అందకపోతే పిలక వైనం
మానవ మస్తిష్కం , స్వార్ధపుారిత
ఆలోచనల మరో ప్రపంచం.॥

మనిషిలో మరో మనిషి చేసే హెచ్చరిక
మనిషి బుద్ధికి అందక తనకు  తానే
చేసే అహంకారపు  అణచివేత. ॥
తన "లో "తనను  అణచివేసే ప్రయత్నంలో
తనను తాను కోల్పోతున్నా
తెలీని అజ్ఞానపు  చీకటి కోట ॥

మనిషకి , మానవత్వానికి
జరిగే యుద్ధంలో మత్సరం నిండిన
ఆలోచన చేసే పతనానికి
బలౌతున్న మనిషి బుద్ధి-॥

బురదగుంటలో బుద్ధి  వేసే
అడుగుతో, మనిషికి మనసుకి
మధ్య జరిగే అంతర్యుద్ధం॥

కళ్ళెదురుగా "మన"ను మనకు
పరిచయం చేస్తున్న మనసు పుటలను,
మనను మనమే  చదువుకోలేని అజ్ఞానం .॥

రెండు నాల్కల పాములా, రెండు
ఆలోచనల మెదడుతో
ఎవరికీ ఎవరుాకాని అశాంతి జీవితానికి
బలౌతున్న మానవ మేధావి
తను తవ్వుకున్న గోతిలో
తానే పడుతున్న స్థితి.
మారని మనుషుల
మాయాజాలపు మనోగతి ॥

No comments:

Post a Comment