అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .
ఘోరుడను ఋషిపుత్రుడ ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి గణ్యుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా ప్రాశస్త్యము నొందెను॥
వేద మంత్ర ద్రష్ట- రు గ్వేదమంత్ర పుాజ్యుగా
చతుర్వేదమందున చర్చ కణ్వ వివరణ .
విశ్వామిత్రు జేరె విధి పుత్రి శకుంతల
కణ్వాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥
గాడమైన యొాగము గాంధర్వ వివాహము
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసుని శాపము
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥
శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥
యాత్ర జేయ కణ్వుడు యాదవ పురమేగెను
సరసమాడ యాదవులు శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను ముప్పుగనదె మారెను ॥
యాదవులు నశించెను యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా గనినట్టే చదివిన,
జగదీశ్వరి మురిసెను జగమునకెరిగించెను ॥.
No comments:
Post a Comment