Wednesday, July 14, 2021

శీర్షిక : నిరాడంబర నిత్య శ్రామికుడు.

కలామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్
వారి  నిర్వాహణ లో ,
కలామ్స్ కన్వెన్షన్౼2021 ,100 కవితల ద్వారా --ఘననివాళులు అర్పించే సందర్భంగా ---
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిపై రాసిన కవిత.

శీర్షిక  : నిరాడంబర నిత్య శ్రామికుడు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
.

మధ్య తరగతి ఆటుపోట్ల జోవితం
పేపర్ బోయ్ గా ప్రగతి పథానికి వేసిన సోపానం,
ఆశల ఆశయాలకు చుట్టిన ఆరంభ శ్రీకారం.
శాస్త్ర-సాంకేతిక రంగాల్లో విజయారోహణం.
దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన కలాం....
క్షిపణుల నిర్మాణంతో ఆకాశపుటంచులను 
తాకే ఆనందోత్సాహపు విజయ ప్రయాణం.
మిస్సైల్ మేన్ గా చరితకెక్కిన  ఘనం. 
 ఉత్తమ రాష్ట్రపతిగా దేశ సేవకు అంకితం.
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ తో                   
ట్యాబ్లెట్ కంప్యూటర్‌ను,కరోనరీ, స్టంట్ ను
రుాపొందించిన ఘనతకు నిదర్శనం .
 అరుదైన బిరుదులకు అర్హతగల వ్యక్తిత్వం.
 నిరాడంబర  నిత్య పోరాటక శాస్త్ర వేత్త.
పిల్లలపై మమకారం, ఇష్టమైన విద్యాబోధక 
రంగంలో అడుగిడిన కలాం కలలు, సాకారం.
వాడని  చిరునవ్వు అతని అస్త్రం. అతడే
"అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్"  .
ఘన కీర్తికి తార్కాణం,దేశాంకిత సేవా భావం, 
 అందరం కలసి చేద్ధాం అతనికి గౌరవ సలాం.
---------------------------------------------------
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment