Thursday, January 21, 2021

అంశం :గాంధీ గారి జాతీయత, అహింస తత్వం ..శీర్షిక : అహింసోద్యమ పోరాటకుడు.

సర్వోదయ ప్రచార కమిటీ వారి ఆధ్వర్యములో,
అంశం :గాంధీ గారి జాతీయత, అహింస తత్వం ..
శీర్షిక : అహింసోద్యమ పోరాటకుడు.

రచన.. శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
    8097622021.

పోరుబందరులో జన్మించిన పోరాట యొాధుడు.
సత్యహరిశ్ఛంద్రచనాటకంతో సత్యాహింసలకు
తల ఒగ్గిన స్వాతంత్ర్య  ఉద్యమకారుడు.॥
ఇంగ్లాండ్ లో బారిష్టర్ చదువుకు వెళ్ళే
ప్రయాణంలో  ఆంగ్లేయులచే అవమానింపబడ్డ తరువాత  మొదలైన జీవిత పోరాటం.॥
కుల వివక్షతకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం.
బ్రిటిష్ వారి ఆధీనంలో బానిసత్వ దశలో
ఉన్న భారతదేశ స్వరాజ్యం కోసం  ఆందోళన .
అటుపై స్వాతంత్ర్య పోరాటం కోసమే
జీవితం అంకితం చేసిన నేషనల్ కాంగ్రేస్ లీడర్.
ఉప్పు పై పన్ను వేసిన కారణంగా చేసిన
ఉప్పు సత్యాగ్రహం తో చేసిన దాండీమార్చ్.
భగవద్గీతలో నిష్ణాతులు .శాంతి పోరాటకులు.
నిమ్న కులాలవారిని, ముస్లిమ్ లను
వేరుచేయడానికి ప్రయత్నించినపుడు చేసిన
నిరాహారదీక్ష.  హరిజనులను ,
"హరి" జనులుగా గౌరవించిన మహనీయుడు.
రెండవ  ప్రపంచ యుద్ధానంతరం,
ఆందోళను కొనసాగిస్తుా   "  భారత్ ఛోడో  " 
"కరో యా మరో" అంటుా   ఉధృతంగా చేసిన
  "క్విట్ ఇండియా" ఉద్యమమం. 1947 లో
భారత్ ను రెండుగా విభజన చేసి మత కల్లోలాలను
సృష్టించి, భారత్ ను వీడిన ఆంగ్లేయులు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని
విభజించకుండా ఐకమత్యంగా ఉంచాలన్న
తాపత్రయపు  ఒంటరి పోరాటం లో విఫలుడైన
మతద్వేషాలకు కుంగిపోయిన  అసలైన
దేశ ప్రేమికుడు.
హిందుా ముస్లిమ్ విభేదాలకు వ్యతిరేకంగా
దిల్లీ లో ఆమరణ దీక్ష చేపట్టి గెలుపొందిన ఘనుడు.
అంతర్గత శత్రువు ల చేతుల్లో ముాడు సార్లు హత్యా ప్రయత్నానికి  గురైన గాంధీ , సామ్రాజ్యవాదం ,
హింసా విధానాలను వ్యతిరేకించేరు.
అహింసతత్వాన్ని బోధిస్తుా నిజాయతీ , నిబద్ధత
నిగ్రహాలను అలవర్చుకున్న గాంధీజీ
తన ఆత్మకధను రాసుకొని దానికి "సత్య శోధన "
అని పేరు పెట్టేరు.
సత్య పోరాటంలో " సత్యమేవ జయతే " అంటుా..
1948 లో దిల్లీ లో నథుారామ్ గాడ్సే చేతిలో
దుర్మరణంపాలయ్యేరు.
అతని మరణానంతరం అతనిపేర "
" గాంధీ శాంతి బహుమతిని" ప్రముఖులకు ,
ప్రొంచ నాయకులకు ,ఇస్తున్న భారత ప్రభుత్వం
వారు అహింసా పద్ధతిలో" దేశ స్వాతంత్ర్య "
  పోరాటానికి తన జీవితాన్నే అంకితం చేసి
  మనకు మన దేశానికి  "స్వాతంత్ర్యాన్ని "
  తెప్పించిన గాంధీజీకి మాత్రం ..
  "నోబెల్ శాంతి బహుమతిని"  ఈయలేదు.
  దేశభక్తికి మారుపేరైన గాంధీజీని ఈనాటికీ
  మనం తలుచుకుంటుా, ఆతని జన్మదినాన్ని,
  వర్ధంతినీ ,కుాడా జరుపుకుంటున్న మనం-
  జాతి మత భేదాలు విడచి , శాంతి,
  అహింసల బాటలో నడుద్దాం.
  భారత దేశ ఖ్యాతిని పెంచుదాం
                      ".జై హింద్  ". .



ఈ వచన కవిత ఏమాధ్యమునందుా ప్రచురితంకాని
నా స్వీయ రచన.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కవిత ఎన్ని లైన్ల లో రాయాలో తెలుపనందున
రాసిన ఈ వచన కవిత నిడివి ఎక్కువైనచో
తెలుప ప్రార్ధన .
తిరిగి రాసి పంపుటకు అనుమతి కోరుచుా...

 
 







No comments:

Post a Comment