Wednesday, January 23, 2019

బంగారు మహరాష్ట్ర.

మహారాష్ట్రా  ఆమని..
--------------------------------

చదివిన చదువుకి దోరికిన ఉద్యోగానికి
సంబంధం  లేని  జీవితాలు
అప్లై చేసినది  ఆరువేల మంది అయితే
అద్రుష్టం వరించినది ఆరుగురికే॥

వారిది  బ్రతుకు తెరువు త్రుప్తి '
మిగిలిన వారిలో చావలేని విరక్తి.
కుాలిన ఆశలని , అవమానాల
అసహాయతని  ముాట కట్టుకొని  ,
బతుకుతెరువు కోసం ,
బహుదుారపు  ప్రయాణం ॥

సన్నిహితుల
సముదాయింపుల సారం
ముంబయ్  మహానగరానికి 
ఆశల పయనం ॥

అడుగు  పెట్టినంతనే 
అదిరిపడిన  అంతరంగం ,
ఎదుట అలలై  పొంగి ,
హోరెత్తే   జనసముద్రం ॥

పగలుా రాత్రీ తేడా తెలీని
ఆర్ధిక  ఆశల  రద్దీ    పేట
ముంబాయ్   నగరం ,
నా లాంటి  వారికి వరాల వేట ॥

తెలుగు మాట ప్రతి చోట. ...
తెలుగు పలుకు ప్రతి నోట...
అన్ని కళలనుా ఆదరంచే 
అందాల పుాదోట ॥

బంగరు కాంతుల బల్బుల తోరణం
బజారు ముాయని మాయా జీవనం
చదివిన వారికీ , చదవని వారికి
బ్రతుకు తెరువు ల బంగారు బాట.॥

కరువు లేని కడుపులు ,
కాయ కష్టపు  బతుకులు...
కలిసి మెలిసే పిలుపులు .,
ఆదరించే వలపులు..॥

వారి భాష  మరాఠీ అన్నది
తెలుగు వారి  పాలిటి  పెన్నిధి అది..॥
అమ్చీ ముంబై  శుభ యాత్రా ,
అదే వెలుగులు పంచే మహరాష్ట్ర ॥

------------------------
రచన...శ్రీమతి
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
                కల్యాణ్.
--------------------------------------------



No comments:

Post a Comment