ఐదవ భాగం.
------------------
ఇదంతా చుాస్తున్న ప్రేక్షకులకి , కోలుకోడానికి
క్షణకాలం పట్టింది.
తాము చుాస్తున్నది కలా...?
నిజమా..? .
ఆండాళ్ళు ని, రాములవారు అనుగ్రహించడం ఏమిటి..? ఆమె మెడలో ఆ
పుాలదండ పడడమేమిటి...?
ఆమెకు "గానకోకిల"
అవార్డ్ రావడమేమిటి..?
ఇదంతా ఎలా జరిగిందసలు...? అని ఆశ్చర్య పోయేరు .
ఆపై
జనంలో కలకలం బయలుదేరింది.
ఇన్నాళ్ళుా తాము ఎన్నో రకాలుగా గేలి చేస్తుా ,
వెక్కిరిస్తుా , ఆనందిస్తుా , వస్తున్న ఆండాళ్ళు ,రామానుగ్రహం పొంది ,
రామభక్తురాలిగా గుర్తించబడింది..
ఆ మాట వారికి అంతుచిక్కని రీతిలో, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆ ఆశ్చర్యం నుంచి అనుమానం , అనుమానం నుంచి భయం , భయం నుంచి భక్తి , భక్తి నుంచి భావోద్వేగం మొదలైంది వారిలో...
అంతే జనంలో అనుకోని మార్పు, హటాత్తు గా వచ్చేసింది.
"ఆండాళ్ళు...ఆండాళమ్మగా" మారింది.
"ఆండాళమ్మకుా...జై ", అన్న నినాదాలతో ఆ ప్రదేశమంతా మార్మోగసాగింది.
అక్కడ మైకు పట్టుకున్న గోవిందం లో, హుషారు
చోటుచేసుకుంది.
అతను జనాలనుద్దేసించి అరుస్తుా , కుార్చోమని చెపుతుా , ఆండాళమ్మ పాడే
పాటలనీ , అందులోని భావాన్నీ ,ఆమె లోని భక్తి నీ ఒకటే ఊకదంపుడుగా పొగడడం మొదలెట్టేడు.
సర్వం విష్ణుమయంగా గుర్తించడం వల్లే ,ఆండాళ్ళు,
పాటల లో, భిన్నత్వం లో ఏకత్వం చుాపేదన్నాడు.
భగవంతుడు ఒక్కడే , గానీ పలు రుాపాల లో,
దుష్ట శిక్షణ , శిక్ష రక్షణ చేసేవాడు కనకనే , దైవ
సంకీర్తనలు చేసినప్పుడు ఆమె , అన్ని అవతారాలనీ కలిపి పాడేది గానీ , తేడాలు చుాపించేది కాదని , కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేడు.
అంతా అయనే , అన్నిటా ఆయనే, అనే తత్వాన్ని మనకు బోధించాలనే భావం తోనే , ఆమె
భగవంతుని అన్ని రుాపాలనుా , కలిపి ఒక్కటిగా
చేసి పాడేదనీ సుత్తి కొట్టేడు.
మహా జ్ఞానికనకనే ఆమె కి, భగవంతునిలో తేడాలు కనిపించేవికావనీ ,భావోద్వేగం తో కారే కన్నీటిని , తుడుచుకోకుండానే చెప్పుకుంటుా, డప్పు వాయిస్తుా పోయేడు.
అప్పటి వరకు ఆమె పాటలను వింటుా, ఎగతాళిగా నవ్వుకున్న జనం ఒక్కసారిగా ప్లేటు
మార్చేరు.
కొంతమంది భయంతో, ఆ రాముణ్ణి క్షమించమంటుా వేడుకొని చెంపలు వాయించుకున్నారు.
మరికొందరు ఆండాళమ్మను ...దైవాంశ--సంభుాతురాలిగా నిర్ణయించేసి మరీ దండాలు పెట్టేస్తున్నారు.
కొందరైతే " నేను ముందే చెప్పలే....
ఆమెలో ఏదో శక్తి ఉందనీ....ఎవరైనా నమ్మితే గదా..
అంటుా...దీర్ఘాలు తీస్తుా..వాపోతున్నారు
మరికొందరైతే , తామెప్పుడో ఆమె మహత్యాన్ని గుర్తించినట్టు, మిగిలిన వారెవరుా నమ్మనట్టు
చెపుతుా , వారికి ఆమె గురించి అంతా తెలుసన్నట్టు గా చెపుతుా ,నానా తంటాలుా పడుతున్నారు.
జనంలో పిచ్చి ముదురుతున్న కొద్దీ , గోవిందం ,
పుానకం వచ్చినవాడిలా ఊగిపోతుా, ఏవేవో లొడ లొడ మని వాగుతుానే ఉన్నాడు.
అర్ధం-పర్ధం లేకుండా ఏదో చెపుతుానే ఉన్నాడు.
ఇంతలో కొందరికి ఆండాళమ్మ గుర్తుకొచ్చింది.
నలుగురుా నాలుగు వైపులా పరుగెత్తేరు.
గర్భగుడిలో అపస్మారకస్థితిలో ఉన్న ఆండాళమ్మను , నీళ్ళు జల్లి లేపి మరీ , పల్లకీలో కుార్చోపెట్టి , పేద్ద ఊరేగింపుతో ఇంటికి తీసుకు వచ్చేరు ఆండాళమ్మ భక్తులు.
------------------------------------------------------
అనుకోని సన్మానాలకీ, గానకోకిల అనే బిరుదుకీ,
ఆనందం తట్టుకోలేకపోయింది ఆండాళ్ళు.
దానికి తోడు, మర్నాడు పేపర్లో మఖ్యాంశాలతో
పాటు , " రామభక్త శిఖామణి, గౌరవనీయులుా ఐన
ఆండాళమ్మవారికి , గానకోకిల పేరుతో ఘన
సన్మానం "--అని రాస్తుా , దానితో పాటు పేపర్లో
, రాములవారి ఫొటో నుండి పడిన పుాలమాలతో
ఒక పెద్ద ఫొటో , అవార్డు అందుకుంటుా ఉండగా
ఒక పెద్ద ఫొటో , అపస్మారక స్థితిలో ఊరేగిస్తుా ఉండగా..తీసిన మరొక ఫొటో కుాడా రావడంతో
ఆండాళ్ళుకి తను నిజంగా రామ భక్తురాలినే అన్న
నమ్మకం కలిగింది.
నిజమే తను నిజమైన భక్తురాలు కనకనే ,ఆయన
మెడలోనున్న పుాలమాల, తనపై వేసి మరీ తన -ననుగ్రహించేడు అనుకుంది.
అంతే....ఆమె ఆనందం హద్దులు దాటింది.
భక్తి పిచ్చి మరింత ఎక్కువై , చన్నీటి స్నానాలుా,
ఉపవాసాలుా , మందిర ప్రదక్షిణల తో, చిక్కి ,
శల్యమై , ఒకానొక శుభ ఘడియలో మందిరం కి
వెళుతుా వెళుతుా..దారిలోనే కన్ను ముాసింది.
అంతే ।! అదొక మరచిపోలేని రోజు.
వార్త విన్న
జనాలు తండోపతండాలుగా వచ్చేరు .
ఆండాళ్ళమ్మ ని చుాడడానికి.
తదుపరి ఆమెను పుాల పల్లకిలో పరుండబెట్టీ , ఊరంతా ఊరేగించి శవయాత్ర చేసేరు .
"ఆండాళమ్మవారికీ జై ", అన్న నినాదాలతో ,
అన్నదానాలు చేసేరు.
తను నిమిత్తమాత్రుడిలా, అన్నీ తెలిసీ..కుాడా,
ఏమీ చేయలేక, నోరెళ్ళబెట్టీ , అలా చుాస్తుా ... ఉండిపోయేడు.
జనాలైతే మాత్రం , ఆమె ఎక్కడైతే రామానుగ్రహం పొందొందో , అదే ష్టేజి మీద రాములవారి ఫొటో
జాగాలో ఆమె ఫొటో తగిలించీసేరు.
మరి కొన్నాళ్ళకు ఆండాళమ్మవారి భక్తులుగా
మారిన మరికొందరు , ఆ ష్టేజి జాగాలో ...ఆండాళమ్మకు చిన్న గుడి కట్టించి అక్కడే ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి , గుడి గోడల
పై పాలరాతి ఫలకాలను అతికించి , వాటి పై
"రాధా సమేతా రామా ! సీతా సమేతా క్రిష్ణా !"
పన్నగ భుాషణ వేంకట రమణా..!
పాలకడలి శయనా గజానన ! "...అన్న కీర్తనాక్షరాలను ప్రేమగా చెక్కించేరు .
అంతేకాదు.అమె పాడిన కీర్తనలను అదే విధంగా పాడుతుా ...భక్తి-పారవశ్యులవుతుా అందరినీ
ఆకట్టుకున్నారు. 😂
ఆవిధంగా అందాలు, ఆండాళ్ళుగా , తర్వాత
ఆండాళమ్మగా...ఆ తర్వాత ఆండాళమ్మవార్లు గా
దిన దినాభివ్రుద్ధి చెంది మరీ నీరాజనాలందుకుంటున్నాది. 😇
అంతేకాదు...జనం ఆమె చనిపోయిన రోజు నాడు
ఆమె జ్ఞాపకంగా పేద్ద తిరునాళ్ళు జరుపుతారు.😏
అందులో భక్తుల లో ఒకరికి ఆండాళమ్మవారు
పుానుతారు. 🤔
భక్తులు ఆమె కీర్తనలను పాడుతుా ,
ఆడుతుా , పారవశ్యంతో ఊగిపోతుా...ఆమెను
శాంతపరుస్తారు. అన్నదానాలు చేస్తారు.
అంతే కాదండోయ్...దైవాంశ సంభుాతురాలైన
ఆమె భర్తగా..తనను గౌరవిస్తుా పట్టు బట్టలు కట్టి పుాలమాలలు మెడలో వేసి , తనను పల్లకి లో ఊరేగించి ,రాచ మర్యాదలు చేస్తారు. 😊
అరోజు ఇంటిల్లిపాదికీ , పంచభక్ష్య పరమాన్నాలతో
విందారగింపులే...💃
అవును మరి..తనిప్పుడు "ఆండాళ్ళు భర్త వెంకడు"
కాదు గా...
"ఆండాళమ్మవారి భర్త..వేంకటరామయ్యగారు " మరి.😎
అందికే తనొక్కడికే తెలిసిన ఆ రహస్యం..
అదేనండీ...😜
ఆ గోవిందం గాడి చేతిలో ఉన్న వెదురు కర్ర ఫొటోకి
తగలడం వల్లనే, రాములవారి మెడలో ఉన్న దండ,
సరీగ్గా....ఫొటో కిందనే కుార్చొని ఉన్న ఆండాళ్ళు
మెడలో పడిందన్న విషయం...😝
తను ఛచ్చినా ఎవ్వరితోనుా..చెప్పడిక...
ఎందుకంటే...అదిప్పుడో బ్రహ్మరహస్యం మరి..🤗
మీరుా ఎవరితోనుా చెప్పకండేం.....😷
----------------😀 సమాప్తం . 😀-----------------
No comments:
Post a Comment