Thursday, May 30, 2019

డా॥ వడ్డేపల్లి క్రిష్ణ గారు.

నాకు వడ్డేపల్లి కృష్ణ గారి గురించి
ఎక్కువగా తెలియదు. సినీ రంగంలో పాటలు   అని పేర్లు
పడ్డప్పుడు " వడ్డేపల్లి కృష్ణ,
డా.సినారె " అని చదివాను .
పాత సినిమాలు నాకు భలే
ఇష్టo.
7 వ.తరగతి నుండి కాలేజిలో B.Ed. కంప్లీట్ చేసే వరకు ప్రతి
వారం తప్పనిసరిగా పాత సినిమాలు చూసేవాన్ని.
సినీపాటల రచయితలు
సీనియర్ సముద్రాల,జూనియర్
సముద్రాల, వీటూరి, ఆరుద్ర,ఆత్రేయ, డా.సినారె,
వేటూరి సుందరరామమూర్తి,
సిరివెన్నెల సీతారామశాస్త్రి,
డా. వడ్డేపల్లి కృష్ణ, ఇత్యాది మహానుభావుల గురించి
' సినీరంగం మాస పత్రికను
తెప్పించుకుని చదివే వాడను.
డా.సినారె షోలాపూర్ నాల్గు
మార్లు వచ్చాడు. ఆయన వచ్చిన
ప్రతిసారి నేను కలిసే వాడను.
ఆయనతో దిగిన ఫొటోలు
నే పుట్టిన గ్రామంలో వున్నాయి.
మేమందరమూ ఉద్యోగరీత్యా
చెల్లచెదరమయ్యాం. ఆ ఫొటోలు
చెదలు తినేశాయి.
ఆంద్రఓపెన్ యూనివర్సిటీ
మొదటి ఛెయిర్మన్ డా.సినారె
గారే. సీనియర్ NTR ముఖ్య
మంత్రి అయ్యాక డా.సినారె కు
ఎన్నో పదవులు ఇచ్చారు.అవన్నీ
డా.సినారె ఓపికగా నిర్వహించారు.
డా.సినారె సినీరంగ ప్రవేశం
" గులేబకావలి " తో జరిగినది.
అన్ని పాటలు హీట్ అయ్యాయి.
అసలు సీనియర్ NTR గారే
డా.సినారె ను సినీరంగ ప్రవేశం
చేయించారు. 
ఒకవైపు ఉద్యోగ భాద్యత,మరో
సినీ పరిశ్రమ అతనికి ఇబ్బంది
పెట్టేవి. హైదరాబాద్ లో
విమానo ఎక్కి మద్రాసు చేరు
కునేసరికి ఆ ప్రయాణoలోనే
సినీపాటలు నాలుగు రాసేవారు.
రామారావు గారి సినిమాలకు
డా.సి.నా.రె. పాటలు తప్పని
సరి. ఆయన అందరి నటులకు+
నటీమణులకు పాటలు రాసి
వారిని అందలమెక్కించాడు.
ఆయనది కరీంనగర్ జిల్లాయే.
రెడ్డికుటుంబంలో పుట్టిన
మొగిలిపువ్వ.
డా.వడ్డేపల్లి కృష్ణ గారిది కరీంనగర్
జిల్లాయే. పద్మశాలి కుటుంభంలో
పుట్టిన పద్మo. డా.సినారె
వడ్డేపల్లి కృష్ణ గారికి ఆదర్శo,
మంచి గురువర్యులు.
డా.వడ్డేపల్లి కృష్ణ గారిని కలువాలని విశ్వ ప్రయత్నం చేశాను
ఎప్పుడూ ఆయన కవిత్వంకు
పలానా పట్టణములో సత్కరాలు
సన్మానాలు అని విని నిరాశతో
వెనుతిరిగే వాడిని. ఆయనను
కల్వనిదే నేను ఊరుకోను ,కన్ను
మూయను.
డా.వడ్డేపల్లి కృష్ణ గారు రాసిన
పుస్తకాలు.
1)కనరా నీ దేశం, 2) అంతర్మథనం
3) గేయ నాటకలు,4)వసంతోద
యం,5)రాగ రథం (లలిత గీతాలు)
6)చిరుగజ్జెలు (బాలల గేయాలు)
7)హాలా హలం (కవితా సంపుటి)
8)మనసా తెలుసా? ,9)మబ్బుల
పల్లకి,10)రెండు సీనిమాలకు
కథ,మాటలు,పాటలు,దర్శకత్వం
అన్ని ఆయనే 1)'ఎక్కడికి వెల్తుందో
మనసు ' 2) 'లావన్య విత్ లవ్ బాయ్స్.
ఇంకా సాహితీ స్రవంతిలో ప్రచురితమైనవి......
1)స్వదేశీయo 2)విశ్వ కల్యాణo,
3)వివేకానంద విజయం,4)ఆమ్రపా లి,5)మహిళా అభ్యుదయo,
6)మాతృదేవోభవ పితృదేవోభవ,
7)శ్రీ కృష్ణదేవరాయలు,8)స్వరభారతీ 9)నృత్యహారతి,
10)సంక్రాంతి లక్ష్మి,11)చండాలిక,
12)ఉగాదివేళ వసంత హేల,
13)తెలుగు అభినయo,14)మానవత్వo......
ఇలా ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు రాశారు.అవి కొన్ని వందలరెట్లు
మనుషుల్ని ప్రభావితo చేస్తాయి.
ఇక చాలు.చెప్పాలంటే ఎన్నో
వున్నాయి...........
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

No comments:

Post a Comment