Thursday, February 2, 2023

పోరాటాల జీవితం . కవిత

02/02/2023.
అ ఆ కవుల భువన విజయ వేదిక .

శీర్షిక  : పోరాటాల జీవితం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.

భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం ,
ప్రతీ కష్టాన్నీ.. తాత్కాలికంగా  మరచిపోవడం ॥
నిన్నటి నెత్తుటి గాయం  , ఈ రోజు
ఉపశమనంతో, రంగుమారుతుంది.॥
గడచిన కష్టకాలపు స్మృతులు, మరపురాని
అంతర్లీన జ్ఞాపకాలై మదిలో నిలిచిపోతాయి.॥
లేమి తనపు కన్నీటి మరకలు, సంతృప్తి నిండిన
సంపాదనతో నవ్వుల మాటున ,వెల-వెలబోతాయి.॥
బీదరికపు పాత చెలిమి ఛాయలు, కొత్త దనపు,
మార్పుకు మనసులో నే మరుగుపడిపోతాయి.॥
విరహవేదన నిండిన అంతరంగం,మరో  ప్రేమ --
కాసారంలో మునిగి, పద్మరాగమై పరిమళిస్తుంది.॥
ఎవరుా లేరన్న ఒంటరితనం,
ఆశల ఆలోచనల విహంగమవుతుంది.॥
అన్నీ కోల్పోతుా కుాడా, ఆశలు-ఆశయాల పయనం,
పరిమళాల  సుమ వీచికయై,  మధురమైన స్వాంతన కలిగిస్తుా, మజిలీదాకా నెట్టుకు వెళ్తుానే ఉంటుంది.॥
ఏ రోజు,  ఎలాగుంటుందో తెలీని ,జీవిత యానం
ఆనంద స్వప్న లోకాల్లో విహరిస్తుా- '
ఎడారిలో ఒయాసిస్సును చేరుకోవాలనే
తపన నిండిన, సద్దుబాటుకు నిదర్శనం .
ఎందుకంటే. ఇది.!  పోరాటాల పరుగు పందెంలో.
,కష్ట- సుఖాలు కలబోసిన   "జీవితం.".
-----------------------------------------
రచన, శ్రీమతి  -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  ( మహరాష్ట్ర ).
---------------------------------------

నా పరిచయం...
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.  ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను   .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.

సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత  గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు  చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా  నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా  గాత్రానికి సంగీత  శ్రీకారం చుట్టేను .

వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
మా ఆత్తయ్యగారు సాహిత్య ప్రియులవ్వడంతో
ఆమె ద్వారా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి , సహజంగా ఉండే ఆశక్తి తోడై  ,
కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా.  రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వీయ రచనలను విని  ఆస్వాదించి ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు  తాను రచించిన శివపదం పాటలను స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో  రెండు CD లుగా  ఆవిష్కరించేరు.  నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా  సన్మానితురాలిని కావడం
నాకు గర్వకారణం.

పలు సంఘాలలో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో  లలిత సంగీతాలు  రచించి స్వరపరచి పాడేను.
బోంబే షణ్ముఖానందలో,  అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో  ఎన్నో సినీ గీతాలు , లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.

కరోనా కారణంగా ప్రస్తుతం "ఆన్ లైన్"  కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం "  బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో  "సంపుార్ణ సుందరకాండ"ను  రచించేను

సంక్షిప్త రామాయణ గాధను , భగవద్గీత పదునెమిది అధ్యాయాలను ,ముప్పది పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచేను..
నేను రాసిన కధలు, కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
పెళ్ళిపాటలు  సంక్రాంతి పాటలు , విరహ గీతాలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , ఇలా వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందిన నేను ,
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా  ఆనందిస్తుా ఉంటాను.

అన్ లైన్ కవితా పోటీల లో  చాలా ప్రక్రియల లో ఇప్పటికీ  పాల్గొంటుా ఉంటాను.

సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
వాటి వివరాలు..

( ఇష్టపది ప్రక్రియలో )
"సాహిత్య చక్రవర్తి. "అనే బిరుదును.
(మహతీ సాహితీ కవి సంగమం వారి నుండి .)
"మహతీ సాహితీ చక్రవర్తి " బిరుదును

సాహితీ బృందావన విహార జాతీయ వేదిక మరియు
ఉమెన్స్ రైటర్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో)
"విశిష్ట మహిళా శిరోమణి."..బిరుదు.
(సాహితీ బ్రందావన జాతీయ వేదిక)నుండి
" కవి కోకిల , సుధీ తిలక " బిరుదులను.
సాహితీ బృందావన జాతీయ వేదిక వారి..సున్నితం
ప్రక్రియ  రచనలకు
."సున్నితం" బిరుదు.ను
పరిమళాలు ప్రక్రియలో..పాటలుగా 30 పాశురాలు తెలుగులో రాసినందుకు)
"అక్షర ఝరీ రత్న "బిరుదును.
శతాక్షరి ప్రక్రియలో కవితలు రాసినందుకుగాను
"పద ముత్యం" బిరుదు.ను కాక
సాహిత్య కళానిధి" , మధుర కవి భుాషణ"
స్వర మయుారి ,వెలుగు దివ్వె".అద్వైత--
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం...
రాణి రుద్రమదేవి ఎక్సలెన్స్ అవార్డ్,
సమాజ సార్థక్ అవార్డ్.,
కాళోజీ  శాంతి  సాహిత్య" పురస్కారం,
భగత్ సింగ్ జాతీయ పుస్కారం ."
సాహిత్య సేవా రత్న వంటి ఎన్నో బిరుదులను
పురస్కారాలను  పొందాను.

నా ఈ పరిచయాన్ని ప్రచురింపగోరిన ....
"అ ఆ కవుల భువన విజయ వేదిక " బృందానికి , కార్యవర్గ సభ్యులకు నమస్కరిస్తుా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..🙏🙏

               
     -----------------------------          
                 

No comments:

Post a Comment