Thursday, October 28, 2021

వాయుపుత్రుడు భీమసేనుడు.

మహతీ సాహితీ కవిసంగమం.
28/10/2021. (గురువారం ).
అంశం : వాయునందనుడు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

మ. సా క సం : 19.
కవితా సంఖ్య : 03

శీర్షిక : వజ్రకాయుడు.
(వచనం )

యాదవరాజైన కుంతిభోజరాజు 
కుమార్తె కుంతీదేవి,వసుదేవుని 
 చెల్లెలు, శ్రీకృష్ణునికి మేనత్తయే 
 గాక పాండురాజు భార్య, 
 పాండవులకు తల్లి. ఆమె అసలు 
 పేరు పృధ ॥
 
 చిన్నతనంలో దుార్వాసుడిచ్చిన 
 అనునుగ్రహ కారణంగా, ఆమె 
 కోరుకున్నపుడు ఏదేవుడిని స్మరిస్తే
 ఆ దైవానుగ్రహం వలన సంతానాన్ని
 పొందగలిగే వరం పొందుతుంది.
ఆ వరోత్సాహంతో వివాహానికి 
ముందే కుంతి, సుార్యదేవుని జపించగా
వర ప్రభావ ఫలితంగా సుార్యుని వలన
కవచకుండలాలతో, సూర్య తేజస్సుతో 
కుంతికి జన్మించిన వాడు కర్ణుడు.।

కుంతికి ,పాండురాజుతో వివాహామైన
పిదప చాలాకాలం వరకు సంతానం 
కలగలేదు.
ఒకపరి
మహర్షులంతా" బ్రహ్మ "సందర్శనానికి 
సత్యలోకం వెళుతున్న సమయంలో,
పాండురాజు తాను కూడా భార్యా
సమేతంగా వెళ్ళబోయి
అపుత్రశ్యాగతిర్నాస్తి" అనే వేద 
వచనాన్ని తలచుకొని బాధ పడుతున్న
తరుణంలో పాండురాజు తో, 
యోగ దృష్టిధనులైన మునులు, 
దైవ  ప్రసాదముతో నీకు పుత్రులు
 కలిగే యొాగముందని పలుకగా,
ఆతని ప్రథమ పత్ని యైన 
కుంతీ ద్వారా "వర " ప్రసాద విషయం 
తెలుసుకున్న పాండురాజు ప్రోద్బలంతో ,
వాయుదేవుని అంశతో,కుంతికి జన్మించిన
వజ్రకాయుడు, పంచపాండవులలో
రెండవ వాడైన వాడు భీముడు.॥

కౌరవానుజుడైన దుర్యోధనుడు 
అతి బలుడైన భీమునిపై అసుాయతో
భీముని నీటిలో పడవేసి చంపడానికి చేసే
ప్రయత్నంలో , నాగలోకానికి చేరి
వెయ్యి ఏనుగుల బలంతో  తిరిగి వచ్చిన 
వజ్రకాయుడు భీమసేనుడు.॥

భుజ బలంలోనూ, గదా యుధ్ధంలోనూ
కౌరవ పాండవులలో సాటిలేని  వీరునిగా
పేరొందిన ఘన గదా ధరుడు భీముడు॥
మల్లయుద్ధ యొాధుడైన భీముడు
మల్ల యుద్ధంలోజరాసంధుని, బకాసురున్నీ
అతని సోదరుడు కిమ్మీరున్నీ వధించిన మేటి.
హిడింబాసురుణ్ణి వధించి, ఆతని సోదరి
హిడింబిని వివాహమాడి, ఘటోత్కచుడనే
పుత్రుని . పత్ని ద్రౌపదిచే  "శ్రుత సోముడు"
 అనే .ఇరువురు పుత్రులను బడసినవాడు.
 
కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు 
అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని
 నిర్జించినవాడు, ధుర్యోధన దుశ్శాసనాది 
 కౌరవులు నూర్గురినీ వధించాడు ఐన
అతిబల భీమకాయుడు భీమసేనుడు ॥

No comments:

Post a Comment